దంతాలు పాడవకుండా ఏం చేయాలంటే..

దంతాలు పాడవకుండా ఏం చేయాలంటే..

నోరు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తరచూ తినాల్సినవి

ఫుడ్​ ద్వారా సరిపోను క్యాలరీలు, లిపిడ్స్​, ప్రొటీన్స్​ అందుతున్నాయా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తారు కొందరు. కానీ, కొన్నిరకాల ఆహార పదార్థాల్లో ఉండే యాసిడ్స్​ పళ్లని దెబ్బతీస్తాయి. అందుకే ఎలాంటి ఫుడ్​ పళ్లకి హాని చేస్తుంది? ఎలాంటి ఫుడ్​ హెల్దీగా ఉంచుతుంది? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు డెంటిస్టులు.   
టీ, కాఫీ లాంటి డ్రింక్స్, కొన్నిరకాల ఫుడ్స్​లోని షుగర్ కారణంగా పళ్ల మీద ఉండే గారలోని బ్యాక్టీరియా యాసిడ్స్​ రిలీజ్​ చేస్తుంది. ఈ యాసిడ్స్​ పంటి మీద ఎనామిల్​ని దెబ్బతీస్తాయి. దాంతో పళ్ల మీద రంధ్రాలు ఏర్పడతాయి. ఈ సమస్య దూరమవ్వాలంటే..

బ్లాక్​ టీ, గ్రీన్​టీల్లో గారలోని బ్యాక్టీరియాని తొలగించే కెమికల్స్​ ఉంటాయి. లీన్​ ప్రొటీన్​లోని ఫాస్పరస్​ చికెన్, చేపలు, కండెన్స్​డ్​ సోయా పాలతో తయారుచేసిన టోఫు వంటివి తింటే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. క్యాల్షియం, ప్రొటీన్లు ఎక్కువ ఉండే బాదం పలుకులు తిన్నా కూడా పళ్లు పాడవ్వవు.
పౌడర్​ రూపంలో ఉన్న జ్యూస్​లు (షుగర్​ ఎక్కువగా కలపనివి), డీ–హైడ్రేటెడ్​ సూప్స్​ వంటివి పళ్లని దెబ్బతీయవు. 

షుగర్​ ఫ్రీ చూయింగ్​ గమ్​ నమిలితే నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. దాంతో పళ్లమధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాలు  పోయి, నోరు శుభ్రమవుతుంది. 

పాలకూర, క్యాబేజీ జాతికి చెందిన ఆకుకూరలతో పాటు రకరకాల  కూరగాయలు భోజనంలో ప్రతిరోజు ఉండాలి. ఫైబర్​, విటమిన్​–సి, విటమిన్​–ఎ ఉన్న క్యారెట్లు పళ్లు, నోటిని హెల్దీగా ఉంచుతాయి. పంటి సమస్యలు ఉన్నవాళ్లు  లడ్డూలు, చాక్లెట్ల  బదులు యాపిల్​ వంటి పండ్లు తినడం మంచిది.